ప్రత్యేకత చాటుకున్న రాష్ట్రపతి.. వర్షంలో తడుస్తూనే గౌరవ వందనం స్వీకరించిన కోవింద్

  • కేరళలో తొలిసారి పర్యటించిన ప్రథమ పౌరుడు
  • వర్షం పడుతున్నా గొడుగును నిరాకరించిన కోవింద్
  • ఆశ్చర్యపోయిన ముఖ్యమంత్రి, అధికారులు
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తానెంతటి నిరాడంబరుడో నిరూపించారు. తన ప్రత్యేకతను, హుందాతనాన్ని చాటుకున్నారు. కోవింద్ తొలిసారి ఆదివారం కేరళలో పర్యటించారు. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఆయన తిరువనంతపురం విమాశ్రయానికి చేరుకున్నారు. కేరళ గవర్నర్ పి.సదాశివన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ఆ సమయంలో వర్షం బాగా పడుతోంది.

దీంతో భద్రతాధికారులు ఆయనకు గొడుగు పట్టేందుకు ప్రయత్నించగా కోవింద్ సున్నితంగా తిరస్కరించారు. వర్షంలో తడుస్తూనే తనకు సమర్పించిన గార్డ్ ఆఫ్ ఆనర్‌ను అందుకున్నారు. అనంతరం మాతా అమృతానందమయి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ చారిటీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు హెలికాప్టర్‌లో కొల్లాం వెళ్లారు. రాష్ట్రపతి వర్షంలో తడుస్తూనే గౌరవ వందనాన్ని స్వీకరించడం చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. ఆయన హుందాతనాన్ని కొనియాడు.
Go Back to Shorts
President
Kovind
umbrella
salute
Thiruvananthapuram

More Telugu News